తెలంగాణ లొల్లి: అసెంబ్లీ రేపటికి వాయిదా
తెలంగాణ తీర్మానం చేయకపోతే తెలంగాణలో రేపటి నుంచి కాంగ్రెసు శాసనసభ్యులు తిరగలేరని ఆయన హెచ్చరించారు. తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ప్లకార్లుడు చింపి స్పీకర్ పైకి విసిరేశారు. అసెంబ్లీ లాబీలో జై తెలంగాణ నినాదాలు చేశారు. అంతకు ముందు శాసనసభ సమావేశం కాగానే తెరాస సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అప్పుడు సభను స్పీకర్ 15 నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ సద్దుమణగలేదు. దీంతో మరో అరగంట పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. రెండు సార్లు వాయిదా పడిన తర్వాత తిరిగి సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేకపోవడం స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
Comments
hyderabad హైదరాబాద్ assembly telangana తెలంగాణ శాసనసభ కిరణ్ కుమార్ రెడ్డి kiran kumar reddy adjourned వాయిదా
Story first published: Tuesday, December 8, 2009, 13:34 [IST]