వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కదిలిన సోనియా గాంధీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై ఎట్టకేలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కదిలారు. సోమవారం సాయంత్రం ఆమె ముఖ్య నాయకులతో విస్తృత చర్చలు జరిపారు. ఇటు రాష్ట్రంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె. రోశయ్యను ఆదేశించిన కాంగ్రెసు అధిష్టానం అటు ఢిల్లీలో విస్తృత మంతనాలు జరిపింది. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కుంటామని పార్టీ అధిష్టానం చెబుతోంది. రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ సమావేశమై గ్రూపుల వారీగా అభిప్రాయ సేకరణ జరిపారు.

అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని రాష్టంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెసు నాయకులు చెప్పగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెడితే మద్దతిస్తామని తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు స్పష్టం చేశాయి. తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలని తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి, సిపిఐ నాయకులు చెప్పారు. తమ వైఖరిని గతంలోనే చెప్పామని సిపిఎం చెప్పింది. ఓట్ల కోసం కాకుండా నిజాయితీగా నిర్ణయం తీసుకోవాలని లోకసత్తా సూచించింది. తమ నిర్ణయాన్ని ఒకటిరెండు రోజుల్లో చెప్తామని మజ్లీస్ తెలిపింది.

సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కోసం శాసనసభలో కాంగ్రెసు అధిష్టానం తీర్మానం ప్రతిపాదింపజేస్తుందని పార్టీ పార్లమెంటు సభ్యులు చెబుతున్నారు. అయితే అధిష్టానం నుంచి ఎటువంటి సూచనలూ రావడం లేదు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును దీక్ష విరమింపజేస్తే మిగతా విషయాలను పరిష్కరించడం కష్టం కాదనే భావనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X