హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ లొల్లి: అసెంబ్లీ పావు గంట వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు ఆందోళనకు దిగడంతో బుధవారం నాడు కూడా శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. తెరాస సభ్యులు తెలంగాణ అంశాన్ని తేల్చాలని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించాలంటూ తెరాస సభ్యులు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ నిరాకరిస్తూ ప్రశ్నోత్తరాల సమయాన్ని తీసుకున్నారు. దానికి తెరాస సభ్యులు అడ్డు తగిలారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి రోశయ్య జోక్యం చేసుకుని మాట్లాడారు. అయినా తెరాస సభ్యులు వినలేదు.

తమ నాయకుడు కె.చంద్రశేఖర రావు దీక్ష చేస్తూ చావుబతుకుల్లో ఉన్నారని, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చేస్తూ తెలంగాణ కావాలని ఉద్యమిస్తున్నారని, ఈ స్థితిలో సభలో వేరే విషయాలు చర్చించడం భావ్యం కాదని తెరాస సభ్యుడు హరీష్ రావు అన్నారు. హరీష్ రావు మైక్ ను కట్ చేసి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించడానికి స్పీకర్ పూనుకున్నారు. ఈ సమయంలో తెరాస సభ్యులు ప్లకార్డులు తీసి నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. బుధవారం సభలోపల, వెలుపల జై తెలంగాణ నినాదాలు చోటు చేసుకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X