తెలంగాణ లొల్లి: అసెంబ్లీ పావు గంట వాయిదా
తమ నాయకుడు కె.చంద్రశేఖర రావు దీక్ష చేస్తూ చావుబతుకుల్లో ఉన్నారని, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చేస్తూ తెలంగాణ కావాలని ఉద్యమిస్తున్నారని, ఈ స్థితిలో సభలో వేరే విషయాలు చర్చించడం భావ్యం కాదని తెరాస సభ్యుడు హరీష్ రావు అన్నారు. హరీష్ రావు మైక్ ను కట్ చేసి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించడానికి స్పీకర్ పూనుకున్నారు. ఈ సమయంలో తెరాస సభ్యులు ప్లకార్డులు తీసి నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. బుధవారం సభలోపల, వెలుపల జై తెలంగాణ నినాదాలు చోటు చేసుకున్నాయి.
hyderabad హైదరాబాద్ assembly telangana తెలంగాణ harish rao శాసనసభ హరీష్ రావు కిరణ్ కుమార్ రెడ్డి kiran kumar reddy
Story first published: Wednesday, December 9, 2009, 9:27 [IST]