వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ లో కాంగ్రెస్ నేతలను చితకబాదిన తెలంగాణ వాదులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: హన్మకొండలో కాంగ్రెస్‌ నాయకులను తెలంగాణ వాదులు చితకబాదారు. సోనియా గాంధీ, వైఎస్‌ బొమ్మలు ఉన్న పార్టీ జెండాలతో జేఏసీ దీక్షా శిబిరంలోకి కాంగ్రెస్‌ నేతలు రావడంపై తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జెండాలు విడవమని కాంగ్రెస్‌ నేతలు మొండికేయడంతో తెలంగాణ వాదులు పిడిగుద్దులు కురిపించారు. హన్మకొండ అదాలత్‌, కాళోజీ సెంటర్‌లో మంగళవారం జరిగిన ఈ సంఘటన ఉద్రిక్తపరిస్థితిని సృష్టించింది. జేఏసీ ఆధ్వర్యంలో కాళోజీ సెంటర్‌ వద్ద హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అంశానికి వ్యతిరేకంగా ఉద్యోగులు దీక్షాలు మంగళవారం కూడా కొనసాగాయి.

దీక్షలు జరుగుతున్న క్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విభాగం కాంగ్రెస్‌ నాయకుడు చింతా ప్రకాష్‌, బుచ్చిరెడ్డి, వెంకటనర్సయ్యతో పాటు మరి కొంత మంది కాంగ్రెస్‌ నాయకుల వాహనాలతో కాళోజీ సెంటర్‌ వద్దకు ర్యాలీగా వచ్చారు. జెండాలు చేతబూని దీక్షా శిబిరం వద్దకు ప్రవేశిం చగానే తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, తెలంగాణను ప్రకటించకుండా నిర్లక్ష్యం చేస్తున్న సోనియాగాంధీ బొమ్మలు ఉన్న జెండాలతో దీక్షా శిబిరంలోకి రావద్దని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. అయితే తాము దీక్షలకు మద్దతు ప్రకటించేందుకు వచ్చామని, తెలంగాణ కోసం నినదిస్తున్నామని కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X