కెసిఆర్ ను చంపాలని చూస్తున్నారు: గద్దర్
సమస్య కెసిఆర్ కుటుంబ సభ్యుల పరిధిలో, తెరాస పరిధిలో లేదని, లక్షలాది ప్రజల సమస్యగా మారిందని ఆయన అన్నారు. ప్రజలు శాంతియుత ఆందోళనలకు పూనుకుని ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన అన్నారు. పదవ తేదీలోగా తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరో కూల్చాల్సిన అవసరం లేదని, అదే పేక మేడల్లా కూలిపోతుందని ఆయన అన్నారు. కెసిఆర్ ను దీక్ష విరమింపజేయాలనే అభిప్రాయాన్ని తప్పు పట్టారు. కెసిఆర్ పదవ రోజుల నుంచి పోరాటం చేస్తున్నారని, ప్రజల్లోకి కెసిఆర్ రావాలని కోరుతున్నామని ఆయన అన్నారు.
ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. టీవీ చానెల్ ప్రతినిధి ప్రశ్నలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా అంతా ఒక్కటిగా నిలబడితే కెసిఆర్ ను రక్షించినవారవుతారని ఆయన అన్నారు. కెసిఆర్ తన చరిత్రను తాను నిర్మించుకుంటారని, కెసిఆర్ చరిత్రను దీక్ష విరమిస్తారా, లేదా అనే దానికి పరిమితం చేయకూడదని ఆయన అన్నారు. కెసిఆర్ లక్షలాది ప్రజల ముందుకు వస్తారని ఆయన అన్నారు. తెలంగాణపై సోనియా గాంధీ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.