హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఆరోగ్యం చేయి దాటుతోంది: నిమ్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆరోగ్యం చేయి దాటుతోందని నిమ్స్ వైద్యులు చెప్పారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై వారు బుధవారం మధ్యాహ్నం మీడియాకు వివరించారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులకు వివరించినట్లు తెలిపారు. ఘనాహారం తీసుకోకపోవడం వల్ల నీరసంగా ఉన్నారని, ప్రోటీన్లు తగ్గుతున్నాయని, పోషకాహారం అందకపోవడం వల్ల నీరసపడిపోతున్నారని వారు చెప్పారు. కెసిఆర్ మాట కూడా బలహీన పడుతోందని వారు చెప్పారు. ప్రోటీన్లు అందకపోవడంతో ఇప్పటికే ఆరు కిలోల బరువు తగ్గినట్లు వారు తెలిపారు. కెసిఆర్ బుధవారం రక్తపరీక్షలకు అంగీకరించకపోవడంతో బులిటెన్ విడుదల చేయకపోయామని వారు చెప్పారు.

ఇదిలా వుంటే, కెసిఆర్ కు పరామర్సల పరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ కెసిఆర్ ను పరామర్శించారు. అన్ని మతాల పెద్దలు ఆయనను చూశారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన ఆకాంక్ష నెరవేరాలని ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. వేద పండితులు పూజలు నిర్వహించారు. ముస్లిం పెద్దలు ప్రార్థనలు చేశారు. వేదపండితులు విష్ణు సహస్ర నామార్చన చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X