విభజన చిదంబరం కుట్ర: ఉమ మహేశ్వరరావు

కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిదంబర రహస్యాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బలంగా ఉద్యమం సాగుతుంటే నిఘా వర్గాలు ప్రశాంతంగా ఉన్నాయని తప్పుడు నివేదికలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. 1969లో ఇంత కన్నా పెద్ద ఉద్యమం చెలరేగినా ఇందిరా గాంధీ రాష్ట్ర విభజనకు అంగీకరించలేదని, రాజీవ్ గాంధీ బుందేల్ ఖండ్ కు అంగీకరించలేదని ఆయన అన్నారు. తమ ప్రజల అభీష్టం మేరకు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications