వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలవంతంగా విజయవాడకు లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను పోలీసులు బలవంతంగా విజయవాడకు పంపించారు. విజయవాడకు చేరుకున్న రాజగోపాల్ మంగళవారం ఉదయమే మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రాన్ని ఎవరూ విడదీయలేరంటూ ఆయన చెప్పారు. సోమవారం దీక్ష విరమించానని, తన దీక్ష కొనసాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. తీర్మానానికి వ్యతిరేకంగా 225 మంది శాసనసభ్యులు ఓటేస్తారని ఆయన చెప్పారు.

సమైక్యాంధ్ర కోసం తెలుగుజాతి అంతా కలిసి పోరాడుతుందని ఆయన చెప్పారు. తమ సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. విజయవాడ ఉద్యమాల గడ్డ అని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర నినాదంతో రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర నిశబ్ద విప్లవం ప్రారంభమైందని ఆయన అన్నారు. తాము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు జాతి సమైక్యతను కాపాడుతానని ఆయన హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X