తెలంగాణ తీర్మానంపై విప్ జారీ చేయం: ప్రణబ్ ముఖర్జీ

తెలంగాణేతర శాసనసభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శాసనసభ్యులు తెలంగాణ తీర్మానంపై ఆత్మప్రబోధానుసారం శాసనసభలో ఓటు వేయవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లాలనే నిర్ణయంలో భాగంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వచ్చారు. ఈ ప్రతినిధి బృందంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. అయితే తాను వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications