వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా, గుంటూరు జిల్లాలో 48 గంటల బంద్ మొదలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Bandh
విజయవాడ: ఆమరణ దీక్షలు చేస్తున్న తెలుగుదేశం నేతలను అరెస్టు చేసినందుకు నిరసనగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 48 గంటలపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బంద్‌ ప్రారంభమైంది. సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

శుక్ర, శనివారాల్లో జిల్లాలో 48 గంటల సంపూర్ణ బంద్‌కు సమైక్యాంధ్ర కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో ఈరెండురోజులు బంద్‌ మరింత ఉధృతం చేసేందుకు జేఏసీ బంద్‌ను పాటించనుంది.

నగరంలోనూ, జిల్లాలోనూ బంద్‌ పటిష్టంగా జరిగేందుకు జాయింట్‌ యాక్సిన్‌ కమిషన్‌ గురువారం నగరంలో ఉన్న స్థానిక స్వాత్రంత్య సమర యోధుల భవనంలో జరిగిన సమావేశంలో తీర్మానించారు. సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా, గాంధీయ వాదంగా ఉద్యమాలు చేస్తుంటే పోలీసులు ఉద్యమాలను భగ్నం చేసి ప్రజలను, ఉద్యమకారులను రెచ్చగొడుతున్నారని జే ఏసీ ఆవేదన వ్యక్తం చేసింది.

రెండు వేల మంది ఉద్యమకారుల మధ్య నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావు, నేతలను పోలీసులు బలవంతంగా తీసుకువెళ్ళడాన్ని జే ఏసీ తీవ్రంగా ఖండించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X