వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి 'సమైక్య'తో హైదరాబాద్ ప్రజారాజ్యం ఖాళీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తీసుకున్న నిర్ణయంతో నగరంలో ఆపార్టీ దాదాపుగా ఖాళీ అయ్యింది. పార్టీ నగర అధ్యక్షుడు కట్టెల శ్రీనివాసయాదవ్‌ సహా ముఖ్య నాయకులంతా పీఆర్పీకి గుడ్‌బై చెప్పేశారు. జోనల్‌ కార్యదర్శులు, వార్డు నాయకులు తమతమ రాజీనామా పత్రాలను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపుతున్నారు. మొన్నటి గ్రేటర్‌ ఎన్నికల్లో ఓల్డ్‌ బోయినపల్లి నుంచి పార్టీ తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్‌ ఎం.నర్సింహయాదవ్‌ కూడా రాజీనామా చేశారు.

చిరంజీవి నిర్ణయం తమను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని, ఆయన తెలంగాణ ప్రజలను వంచించారని, చరిత్ర హీనుడుగా మిగులుతారని, కేవలం స్వార్థం కోసమే చిరంజీవి ఆ నిర్ణయం తీసుకున్నారని పీఆర్పీ నాయకులందరూ ముక్తకంఠంతో నిరసన వ్యక్తంచేస్తున్నారు.

గ్రేటర్‌లోని 150 వార్డుల నాయకులందరూ ఇదేస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో దాదాపు 12లక్షల మంది ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.సామాజిక తెలంగాణ అనే నినాదానికి ఆకర్షితులమై తాము పార్టీ జెండాను భుజాన వేసుకుని మోశామని, తీరా తెలంగాణ ప్రకటన వచ్చాక సమైక్యాంధ్రకు జై కొట్టడంపై వారు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో ఎందరో పార్టీని వీడి వెళ్లినా, తీవ్ర విమర్శలు చేసినా తాము భరించామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవిని ఎవరో తప్పుదోవ పట్టించారన్న ఆవేదనను వ్యక్తం చేస్తూనే తామిక ఆ పార్టీలో కొనసాగబోమని వేరు కుంపటి పెట్టుకుంటామని వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X