వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి తూ.గో పర్యటనపై మెగా ఆశలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కాకినాడ: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈ నెల 20వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకోవడానికి ఆయన ఈ పర్యటన చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యంలో చిరంజీవి పర్యటనకు మంచి స్పందన వచ్చే అవకాశముంది.

ఈనెల 20వ తేదీ ఉదయం తుని నుంచి అన్నవరం వచ్చి స్వామి దర్శనం చేసుకున్న అనంతరం కత్తిపూడి చేరుకుంటారు. అక్కడి నుంచి గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, రాజానగరం మీదుగా రాజమండ్రి చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు. 21న పశ్చిమగోదావరిజిల్లా పర్యటనకు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X