వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి వదిలేయండి: నేతలకు డిఎస్ సూచన

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి వదిలేయాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. అందరి మనోభావాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న పార్టీ నాయకులు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు నిరసనగా చేసిన రాజీనామాలను తమ పార్టీ శాసనసభ్యులు ఉపసంహరించుకుంటారని ఆయన చెప్పారు.

తమ పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, తదితరులు ఢిల్లీకి వెళ్లి తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వినిపించారని, వారి అభిప్రాయాలను కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు విరమించి ప్రశాంతతకు దోహదపడాలని ఆయన సూచించారు. శాంతియుతంగా కాంగ్రెసు నాయకులు తమ వాదనలను వినిపించాలని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల మనోభావాలను పార్టీ అధిష్టానం అర్థం చేసుకుంటుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X