వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్య గట్టిగా మాట్లాడలేరు: జెసి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో గత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అంత గట్టిగా ప్రస్తుత ముఖ్యమంత్రి కె.రోశయ్య మాట్లాడలేక పోయారని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు వ్యతిరేకంగా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచడానికి కాంగ్రెసు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఇక్కడికి వచ్చారు. ఆ ప్రతినిధి బృందంలో జెసి ఉన్నారు. తెలంగాణ కోసం ఆ ప్రాంత నాయకులు తమ వాదన వినిపించడానికి ఎన్నో సార్లు ఢిల్లీ వచ్చారని, తాము పట్టించుకోలేదన, వైయస్ రాజశేఖర రెడ్డికి తాము వదిలేశామని ఆయన చెప్పారు. అయితే వైయస్ అంత గట్టిగా రోశయ్య వ్యవహరించలేకపోయారని ఆయన అన్నారు. రోశయ్య స్వభావం వేరు, రాజశేఖర రెడ్డి స్వభావం వేరని, రోశయ్య స్వతాహాగా సౌమ్యులని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ తీర్మానం ఆమోదించాల్సిందేనని ఆయన చెప్పారు. ఆ విషయంలో తెలియకపోవడం వల్లనే రాయలసీమ, కోస్తాంధ్రల్లో ఉద్యమాలు చెలరేగుతున్నాయని ఆయన అన్నారు. కేంద్రం వివరణ ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగించాల్సిందేననే వాదనతో తాను ఏకీభవిస్తానని, అయితే విద్యార్థులు ఉద్యమంలో అరెస్టయితే వారి భవిష్యత్తు దెబ్బ తింటుందని ఆయన అన్నారు. రాజీనామాల ఉపసంహరణపై తాము మాట్లాడుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X