వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి చెడగొట్టుకున్నారు: జీవన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

T Jeevan Reddy
హైదరాబాద్: జై ఆంధ్ర నినాదం అని ఉంటే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మంచి నాయకుడై ఉండేవారని, సమైక్యాంధ్ర నినాదం చేసి చెడగొట్టుకున్నారని కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును పరామర్శించారు. కెసిఆర్ తో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని, అందుకు శాసనసభ తీర్మానం అవసరం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ స్వార్థం కోసం సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారని ఆయన విమర్సించారు. తన స్వార్థం కోసం ఆంధ్ర ప్రజలను బలి చేయడానికి లగడపాటి సిద్ధపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న పార్టీ నాయకులపై మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న తమ పార్టీ కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల కార్యకలాపాల సీడీలు తమకు అందుతున్నాయని, వారిపై తాము పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ నాయకులు సమావేశమై తన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీలకు అతీతంగా తెలంగాణ నాయకులు పని చేస్తారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X