వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ జాతీయ సమస్య: జెపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayan
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్టానికి మాత్రమే సంబంధించింది కాదని, జాతీయ సమస్య అని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. దీనిపై కేంద్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఆయన శుక్రవారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ఆయన మొయిలీకి వివరించారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విశాల దృక్పథంతో ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలని ఆయన మొయిలీకి విజ్ఞప్తి చేశారు.

ఆ తర్వాత ఆయన ప్రతిపక్ష నేత, బిజెపి ఆగ్రనాయకుడు ఎల్ కె అద్వానీతో సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితుల గురించి ఆయన అద్వానీకి వివరించారు. జయప్రకాష్ నారాయణ గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై తలెత్తిన సమస్యను ఆయన వారికి వివరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X