వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ లొల్లి: లోకసభ నిరవధిక వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై వరుసగా గొడవలు జరిగి సభా కార్యక్రమాలు స్తంభించపోతుండడంతో స్పీకర్ మీరా కుమార్ లోకసభను నిరవధింగా వాయిదా వేశారు. లోకసభలో వరుసగా జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలు చెలరేగుతున్నాయి. తెలుగుదేశం సభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకళ్లి ఆందోళన సాగిస్తున్నారు. శుక్రవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో మీరా కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో శుక్రవారం కూడా సభ అట్టుడికింది. దీంతో తొలుత సభ 40 నిమిషాల పాటు వాయిదా పడింది.

ఆంధ్రప్రదేశ్ సభ్యులు రెండుగా విడిపోయి తెలంగాణ అనుకూల, వ్యతిరేక నినాదాలు చేస్తూ పోడియం వైపు దూసుకెళ్లారు. దీంతో సభ ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీకి వ్యతిరేకంగా తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితి సద్దుమణగలేదు. దీంతో మీరా కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. కొందరు సభ్యుల తీరు అభ్యంతర కరంగా ఉందని స్పీకర్ మీరా కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడం మంచిదని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X