హైదరాబాద్ లో ఆర్య-2 కు తెలంగాణ వాదుల అడ్డంకి

టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ కార్యకర్తలు కాప్రాలోని శివశక్తి సినిమా థియేటర్పై దాడి చేసి 'సలీమ్' పోస్టర్లు చింపివేసి కటౌట్లను ధ్వంసం చేశారు. కుషాయిగూడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్లోని పలు థియేటర్లపై టీఆర్ఎస్ నాయకులు గురువారం దాడి చేసి సినిమా ప్రదర్శనలను నిలిపివేయించారు. పోస్టర్లను చింపివేసి కటౌట్లు దగ్ధం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకులైన చిరంజీవి, మోహన్ బాబు కుటుంబాల చిత్రాలను తెలంగాణలో ఆడనివ్వబోమని హెచ్చరించారు. మల్కాజిగిరిలోని రాఘవేంద్ర థియేటర్లో సలీమ్ సినిమా పోస్టర్లను టీఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేసి థియేటర్ను మూసివేయించారు. సికింద్రాబాద్లోని ప్రశాంత్ థియేటర్ ముందు పీజీ కళాశాల విద్యార్థులు ఆందోళన జరిపి మోహన్బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోహన్బాబు, విష్ణువర్ధన్ల కటౌట్లు ధ్వంసం చేశారు. పోస్టర్లు చింపి బ్యానర్లను తొలగించారు. దీంతో యాజమాన్యం సినిమా ప్రదర్శనను రద్దు చేసింది. ఇదే ప్రాంతంలోని మంజు థియేటర్లో ఆర్య-2 సినిమాను నిలిపివేయించారు. దీంతో రెండవ రోజు కూడా సినిమా ప్రదర్శన ఆగిపోయింది. లోతుకుంటలోని లకి కళామందిర్, నర్తకి థియేటర్లలోనూ ఆ రెండు చిత్రాలను నిలిపివేయించారు.
తెలంగాణ ప్రజల పోరాటాల చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి...లేదంటే అడ్రస్లు మారతాయని హెచ్చరిస్తూ మోహన్ బాబు, చిరంజీవిలపై ఓయూ టీఎస్ జాక్ నాయకులు మండిపడ్డారు. ఓయూలో చిరంజీవి, మోహన్బాబుల దిష్టిబొమ్మలకు శవయాత్ర జరిపి దగ్ధం చేశారు. సినిమా డైలాగులు బయట మాట్లాడితే హీరోను జీరో చేస్తామని మోహన్బాబును హెచ్చరించారు. సామాజిక తెలంగాణ గురించి ఎన్నికల ముందు మాట్లాడిన చిరంజీవి తన అభిప్రాయాలు మార్చుకోవచ్చని సిగ్గు విడిచి మట్లాడుతున్నాడని మండిపడ్డారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications