వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధర్నా: తెరాస ఎమ్మెల్యేల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా అరెస్టయిన విద్యార్థుల జెఎసి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు శుక్రవారం కూడా సచివాలయంలో ధర్నా చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారిని విడుదల చేయాలని హరీష్ రావు, ఈటెల రాజేందర్, కొప్పులు ఈశ్వర్ ధర్నాకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేశారు.

గురువారం ముఖ్యమంత్రి రోశయ్య ఇచ్చిన హామీ మేరుక జెఎసి నాయకులను శుక్రవారం విడుదల చేసి మరో కేసులో అరెస్టు చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అయితే వారిని వెంటనే విడుదల చేయాలని తెరాస శాసనసభ్యులు ధర్నాకు దిగారు. తెరాస నేతలు, కార్యకర్తలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య జోక్యం చేసుకుని వారిని విడిపించారు. తాము విడిపోవాలని కోరుకుంటున్నామని, విడిపోయిన తర్వాత బంగారు తెలంగాణను తామే ఏర్పాటు చేసుకుంటామని మాజీ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X