అడ్డుకుంటే బాబునూ వదులుకుంటాం: టిడిపి

మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాబోమని తెలంగాణ మంత్రులు చెప్పినంత మాత్రాన సరిపోదని, ఇంట్లో కూర్చుని ఫైళ్లు చూస్తున్నారని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. ఢిల్లీలో తెలంగాణ మంత్రలకు తగిన గౌరవం లభించలేదని, వారికి అవమానం జరిగిందని ఆయన అన్నారు. మంత్రులు పూర్తిగా రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాష్టపతి పాలనను తలపిస్తోందని మరో తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. శాంతిభద్రతలపై గవర్నర్ నరసింహన్ డిజిపి, ఇంటెలిజెన్స్ ఐజిలతో సమీక్ష జరపడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications