వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్టుబడులపై రోశయ్చకిది తగదు: హరీష్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: ఆందోళన వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని ముఖ్యమంత్రి కె. రోశయ్య అసత్య ప్రచారానికి దిగుతున్నారని, రోశయ్య స్థాయికి అది తగదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల వల్ల గత నెల రోజులుగా పారిశ్రామిక సంస్థలు తరలిపోతున్నాయని రోశయ్య చెబుతున్న మాటల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి ఎన్నో కంపెనీలు తరలిపోయాయని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్, నానో కార్ల కర్మాగారం వంటివి ఏ ఉద్యమాల కారణంగా రాష్ట్రానికి రాలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదుపై ఆంధ్ర పాలకులు అసత్య ప్రచారానికి దిగుతున్నారని ఆయన విమర్శించారు. కూకట్ పల్లిలోని జెఎన్టీయులో జరిగిన తెలంగాణ ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఆందోళనకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X