తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సచివాలయంలో రెండు గంటలుగా సాగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పాఠశాలలతో సమానంగా జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సైతం ప్రతిరోజూ ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం), పాలు అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించనున్న అంశాలపైనా చర్చలు జరిపింది. 2027 గోదావరి పుష్కరాలకు రూ. 1000కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో తొలి విడతగాలో భాగంగా రూ. 300 కోట్లు మంజూరుకు నిర్ణయం తీసుకుంది.

అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం మండలం వెలిదిలో 14 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్ లో 5, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. గంగాధర డిగ్రీ కాలేజీకి 29, కేసముద్రం ఫైర్ స్టేషన్ కు 18 పోస్టులు మంజూరు చేసింది. మొత్తానికి ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ అటు స్టూడెంట్స్ కు, ఇటు నిరుద్యోగులకు, భక్తులకు ఎంతో మేలు చేకూర్చేలా సాగింది. ఇంకా ఈ సమావేశంలో ఇందిరమ్మ కుటుంబ బీమాతోపాటు కొత్త ఫించన్ల పంపిణీపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications