ప్రొఫెసర్ హత్య కేసు: నిందితులను తప్పించే యత్నం?
అయితే హత్య జరిగిన వెంటనే సాయికుమార్ పరారీలో ఉన్నట్టు పేర్కొన్న పోలీసులు రెండు రోజులు తర్వాత సాయికుమార్ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే చిన్నచిన్న చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకుంటే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించే పోలీసులు, హత్య కేసులో ప్రధాన నిందితుడైన సాయికుమార్ను అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా రిమాండ్కు తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాకుండా హత్యకేసులో ఒక్క సాయికుమార్కే సంబంధం ఉందని చెప్పి పోలీసులు మిగిలిన నిందితులను కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కేసులో నిందితులను కాపాడేందుకు పొరుగు జిల్లాకు చెందిన ఒక మంత్రి రంగంలోకి దిగినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిందితుడు చెబుతున్న వివరాలకు పోస్టుమార్టం నివేదికకు చాలా వ్యత్యాసం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కాగా సాయి కిషోర్ హత్యకేసు దర్యాప్తుపై ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, ఈకేసును తానే స్వయంగా పనర్విచారణ చేపటనున్నట్టు నగర పోలీస్ కమిషనర్ ఎన్.సాంబశివరావు తెలిపారు.