వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొఫెసర్ హత్య కేసు: నిందితులను తప్పించే యత్నం?

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: సంచలనం కలిగించిన అసోసియేట్ ప్రొఫెసర్ హత్య కేసును పోలీసులు నీరుగార్చుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈనెల 23న తెన్నేటిపార్కులో వెలుగుచూసిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బోగిసాయి కిషోర్‌ హత్యకేసుతో ప్రమేయమున్న మరికొంతమంది నిందితులను తప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కిషోర్‌ను హత్యచేసే ముందు సాయికుమార్‌తోపాటు అతని బంధువులు ఇద్దరు, మరో స్నేహితుడు కూడా సంఘటనా స్థలం వద్ద ఉన్నట్టు కొంతమంది పేర్కొంటున్నారు. కిషోర్‌ హత్యలో వీరి ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.

అయితే హత్య జరిగిన వెంటనే సాయికుమార్‌ పరారీలో ఉన్నట్టు పేర్కొన్న పోలీసులు రెండు రోజులు తర్వాత సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే చిన్నచిన్న చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకుంటే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించే పోలీసులు, హత్య కేసులో ప్రధాన నిందితుడైన సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా రిమాండ్‌కు తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతేకాకుండా హత్యకేసులో ఒక్క సాయికుమార్‌కే సంబంధం ఉందని చెప్పి పోలీసులు మిగిలిన నిందితులను కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కేసులో నిందితులను కాపాడేందుకు పొరుగు జిల్లాకు చెందిన ఒక మంత్రి రంగంలోకి దిగినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిందితుడు చెబుతున్న వివరాలకు పోస్టుమార్టం నివేదికకు చాలా వ్యత్యాసం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కాగా సాయి కిషోర్‌ హత్యకేసు దర్యాప్తుపై ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, ఈకేసును తానే స్వయంగా పనర్విచారణ చేపటనున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.సాంబశివరావు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X