తెలంగాణపై వెనకడుగు లేదు: చిదంబరం

డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో సిపిఎం మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రవేశపెడితే బలపరుస్తామని చెప్పాయని, మజ్లీస్ మాత్రం చర్చ సందర్భంగా తమ అభిప్రాయం చెబుతానని తెలిపిందని, ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో తాను డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తామని, శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతారని చెప్పామని ఆయన వివరించారు. ఆ ప్రకటనలోని కీలకమైన పదాలను ఆయన చదివి వినిపించారు. అయితే తాను 9వ తేదీ ప్రకటన చేసిన తర్వాత రాజకీయ పార్టీలు మాట మార్చాయని, దాంతో 23వ తేదీన మరో ప్రకటన చేయాల్సి వచ్చిందని, దాంట్లో విస్తృత ప్రాతిపదికపై చర్చలు జరుపుతామని చెప్పామని, అది మాట మార్చడం కాదని, తెలంగాణకు కట్టుబడి ఉన్నాం కాబట్టే జనవరి 5వ తేదీన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
తమ యుపిఎ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో కూడా తెలంగాణ ఇస్తామని చెప్పామని ఆయన గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయాలు పార్టీలు ఏదో రూపంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలత వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రణాళికలో చేర్చాయని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications