తూగో జిల్లాలో సంపూర్ణ బంద్ కు రంగంలో అన్ని పార్టీలు
ఢిల్లీ చర్చలకు ముందుగానే సీమాంధ్ర బంద్కు జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. దాని మేరకు జిల్లాలో సోమవారం సంపూర్ణంగా బంద్ నిర్వహిం చేందుకు వివిధ పార్టీల నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నాలుగు రోజులుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ జిల్లాలో బంద్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా బంద్కు మద్దతు పలికినందున జిల్లాలో పీఆర్పీ నాయకులు ఆందోళనకు సహకరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజమండ్రి, అమలాపురం తదితర చోట్ల ఆదివారం జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాలకు హాజరై బంద్కు మద్దతును ప్రకటించారు.
కాకినాడలో ఆదివారం టీడీపీ జిల్లా అడ్హక్ కమిటీ సమావేశమై సోమవారం నాటి బంద్ను మంగళవారం నాటి రైల్రోకో ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించింది. జిల్లాలో బంద్కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతుగా నిలవనుంది. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో మూడోసారి బంద్ జరగనుండటం గమనించాల్సిన విషయం. బంద్ పిలుపు దృష్ట్యా ఆర్టీసీ బస్సు సర్సీసుల్ని నిలిపి వేయనుంది. జిల్లాలో ఆదివారం రాత్రి నుంచే బస్సుల్ని నిలిపివేస్తున్నారు.