వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హస్తినలో బిజీ బిజీగా సిఎం రోశయ్య

కాగా, రోశయ్య కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంతో కూడా సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో కూడా ఆయన సమావేశమవుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో కూడా రోశయ్య పాల్గోనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై అనుసరించాల్సి వైఖరిపై కోర్ కమిటీ చర్చించనుంది. రోశయ్య కన్నా ముందుగానే డి. శ్రీనివాస్ ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెసు నాయకులు ప్రాంతాలవారీగా సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. లగడపాటి రాజగోపాల్, జెసి దివాకర్ రెడ్డి పనబాక లక్ష్మి వంటి సమైక్యవాదులు, టి జీవన్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు సమావేశమయ్యారు.