వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర బంద్ లో చెలరేగిన హింస

By Pratap
|
Google Oneindia TeluguNews

Seemandhra Bandh
విజయవాడ: సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం తలపెట్టిన బంద్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. నెల్లూరులో పెద్ద యెత్తున హింస చెలరేగింది. నెల్లూరులోని తిక్కన భవన్ లో గల బిఎస్ఎన్ఎల్ కార్యాలయంపై సమైక్యవాదులు దాడి చేశారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కపిల్ చిట్ ఫండ్స్ పై కూడా ఆందోళనకారులు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కోఆపరేటి బ్యాంక్ కార్యాలయంపై ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడులతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు చేసిన సమైక్యవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, చిత్తూరులో పెట్రోల్ బంక్ పై సమైక్యాంధ్ర ఆందోళనకారులు దాడులు చేశారు. విజయవాడలో కూడా అరెస్టులు జరిగాయి. బంద్ సందర్భంగా పోలీసులు 200 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో 500 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకుడు దేవినేని అవినాష్ ను పోలీసులు అరెస్టు చేసి పమిడిముక్కల పోలీసు స్టేషన్ కు తరలించారు. అవినాష్ అరెస్టును అడ్డుకోవడానికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే ఫలితం లేకపోయింది. అవినాష్ అరెస్టును సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు మండలి బుద్దప్రసాద్, దేవినేని నెహ్రూ, దేవినేని ఉమా మహేశ్వరరావు, కృష్ణారావు ఖండించారు. విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద వారు ధర్నాకు దిగారు. పలు జిల్లాల్లో ఆందోళనకారులు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X