వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ గుర్తొస్తున్నారు: జయప్రద

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprada
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన కోసం ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే తనకు స్వర్గీయ ఎన్టీ రామారావు గుర్తుకొస్తున్నారని సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ సినీ నటి జయప్రద అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీ రామారావు ఢిల్లీలో చాటారని, ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బ తినే పరిస్థితులు తలెత్తాయని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగు ప్రజల విభజన రాజకీయాలు తనకు ఎంతో బాధ కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టకూడదని ఆమె రాష్ట్ర రాజకీయ నాయకులను కోరారు.

తమ పార్టీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని ఆమె చెప్పారు. రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నాయని, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య మనస్ఫర్థలు హెరిగాయని, ఇది తనకు ఎంతో బాధ కలిగిస్తోందని ఆమె అన్నారు. ఓట్ల కోసమో, మరి దేని కోసమో రాష్ట్ర విభజనకు యుపిఎ హామీ ఇచ్చిందని, ఇటీవల అర్థరాత్రి ప్రకటన చేసిందని ఆమె అన్నారు. రెండు ప్రాంతాలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆమె కేంద్రాన్ని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X