రాష్ట్రపతి పాలనకు మజ్లీస్ డిమాండ్

తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టుల పాత్ర ఉందనే వాదనను తాను చిదంబరంతో జరిగిన సమావేశంలో తోసిపుచ్చినట్లు కాంగ్రెసు తెలంగామ ప్రతినిధి ఉత్తమ కుమార్ రెడ్డి చెప్పారు. ఉద్యమంలో మావోలు లేరని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే మావోల ప్రాబల్యం పెరుగుతుందనే వాదనను కూడా తాను తోసిపుచ్చానని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లాడిన తర్వాత చిదంబరం ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications