వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై రెండో దఫా చర్చలు: ఎఐసిసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayanthi Natrajan
న్యూఢిల్లీ: తెలంగాణపై రెండో దఫా చర్చలు జరుగుతాయని ఎఐసిసి అధికార ప్రతినిధి జయంతీ నటరాజన్ చెప్పారు. ఇతర పార్టీలు మాట మార్చడం వల్లనే తెలంగాణ సమస్య జఠిలమైందని ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విస్తృత ప్రాతిపదికపై చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుందని ఆమె అన్నారు. తాము ఎన్నికల ప్రణాళికలో తెలంగాణపై చెప్పిన మాటకు కాంగ్రెసు క్టటుబడి ఉంటుందని ఆమె చెప్పారు.

విస్తృత స్థాయి చర్చలకు రాష్ట్రంలో తొలుత శాంతియుత పరిస్థితులు నెలకొనాల్సి ఉంటుందని, శాంతియుత పరిస్థితులు నెలకొన్న తర్వాతనే విస్తృత స్థాయి చర్చలు జరుగుతాయని ఆమె అన్నారు. రాష్ట్ర విభజన అంశం రాజకీయ, భావోద్వేగ సమస్య అని, దాని వల్ల అశాంతి నెలకొందని, ముందు ఆ పరిస్థితి తొలగాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X