చంద్రబాబుకు అన్నీ తెలుసు: సబితా ఇంద్రారెడ్డి

టీవీ చానెళ్లలో వార్తాకథనం ప్రసారమైన వెంటనే రాష్టంలో విధ్వంసం చెలరేగిందని, విధ్వంసానికి పాల్పడిన కేసుల్లో 187 మందిని అరెస్టు చేశామని ఆమె చెప్పారు. మొత్తం 96 కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కేసుల్లో ఎంతటివారైనా ఉపేక్షించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని ఆమె చెప్పారు. వైయస్ మరణంపై వార్తాకథనం ప్రసారం చేసిన టీవీ చానెల్ పై కేసు నమోదు చేస్తామని, దర్యాప్తు కోసం కేసు నమోదు చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications