వైయస్ జగన్ ను సిఎంగా చూడాలనుంది: కొండా సురేఖ

రాష్టంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉందని ఆమె విమర్శించారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణించి నాలుగు నెలలు గడుస్తున్నా దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆమె అన్నారు. తన ప్రియతమ నాయకుడిని కోల్పోయిన బాధాతప్త హృదయంతో ఉన్న ప్రజలు వైయస్ మరణం వెనక కుట్ర ఉందని వార్తాకథనాలు రాగానే ఉద్రేకానికి లోనయ్యారని ఆమె అన్నారు. తాము జిల్లా బంద్ పాటించడానికి బయలుదేరుతుంటే ఎస్పీ అడ్డుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications