ఆంధ్రా ఉత్పత్తులు బహిష్కరించాలని వేదిక పిలుపు

ఇకనైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గవర్నర్, స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చి రాజీనామాలను ఆమోదింపచేసుకోవాలని సూచించారు. కేయూ అకుట్ అధ్యక్షుడు పాపిరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో ఆంధ్రా వాళ్లు పెట్టిన పెట్టుబడులు ఏమీ లేవని ఇక్కడి భూములు, వనరులను వినియోగించుకునే వారు అభివృద్ధి చెందారని పేర్కొన్నారు. రామోజీరావు నుంచి సత్యం రామలింగరాజు, రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి వరకు అందరి పరిస్థితి ఇదేనన్నారు. సినీ పరిశ్రమ తరలిపోయినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నష్టపోయేదేమీ లేదని, వాటి భూములైనా ఇక్కడి ప్రజలకు మిగులుతాయన్నారు. సమావేశంలో విద్యావంతుల వేదిక నాయకులు ప్రొఫెసర్సీతారామారావు, నారాయణరావు, శ్రీనివాసరెడ్డి(డీటీఎఫ్), విజయ్బాబు, ఎం.వీరన్న తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications