అసలే కోతి: జగన్ పై రామయ్య వ్యాఖ్యలు

రామయ్యపై సాక్షి టీవీ ప్రతినిధులు వాదనకు దిగారు. తనపై వాదనకు దిగడం సరి కాదని, తాను చెప్పింది రాసుకోవాలని, ప్రశ్నలు అడగాలే తప్ప వాదనకు దిగకూడదని, జగన్ ను జర్నలిస్టులు భుజాన మోయడం మంచిది కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్ డబ్బులు, టీవీ చానెల్, పత్రిక వంటి అన్ని హంగులూ సమకూర్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రిలయన్స్ పై దాడులను వైయస్ జగన్ విచ్చలవిడిగా రొచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. తమ నేతను బలపరచడం తన విధి అని, తానేమైనా తప్పుగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications