వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరూ బాగుండాలి: మోహన్ బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mohanbabu
తిరుపతి: అందరూ సుఖసంతోషాలతో ఉండాలని తాను తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చెప్పారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారంనాడు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిరుటిలా గొడవలు లేకుండా ఈ ఏడాది అందరూ సంతోషంగా ఉండాలని తాను కోరుకున్నట్లు మోహన్ బాబు కుమారుడు, సినీ నటుడు మనోజ్ కుమార్ చెప్పారు.

నిరుడు సినిమా షూటింగ్ సందర్భంగా తనపై దాడి చేసినవారి మీద తనకేమీ కోపం లేదని ఆయన అన్నారు. అందరితో పాటు వారు కూడా ఈ కొత్త సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, వారికి మంచి జరగాలని తాను శ్రీవారిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మోహన్ బాబు భార్య, కుమారుడు విష్ణువర్ధన్ బాబు, ఆయన భార్య విరానిక తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు అర్జున్ కూడా వారి వెంట ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X