కాంగ్రెసు నుంచి వంశీచందర్ బహిష్కరణ

Congress
హైదరాబాద్: రిలయన్స్ పై దాడుల వ్యవహారంలో ఎన్ఎస్ యుఐ మాజీ అధ్యక్షుడు వంశీచందర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలిపారు. వంశీచందర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. రిలయన్స్ పై దాడులకు వంశీచందర్ రెడ్డి ఎస్ఎంఎస్ లు ఇచ్చారనే ఆరోపణపై పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. దానికి వంశీచందర్ రెడ్డి ఇచ్చిన సమాధానంతో పార్టీ నాయకత్వం సంతృప్తి చెందలేదు. దీంతో ఆయనపై బహిష్కరణ వేటు వేసింది. పార్టీ ప్రయోజనాలకు వంశీచందర్ రెడ్డి నష్టం కలిగించేలా వ్యవహరించారని పార్టీ విచారణ కమిటీ అభిప్రాయపడింది.

వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక రష్యన్ వెబ్ సైట్ ప్రచురించిన వార్తాకథనం ఆధారంగా మూడు తెలుగు టీవీ చానెళ్లు వార్తాకథనాన్ని ప్రసారం చేశాయి. ఈ వార్తాకథనం ప్రసారమవుతుండగానే రాష్ట్రవ్యాప్తంగా రిలయన్స్ సంస్థలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు ఎస్ఎంఎస్ లు ఇచ్చి వంశీచందర్ రెడ్డి పురికొల్పాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో కాంగ్రెసు నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఇప్పుడు ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+