తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోంది: డిఎస్

D Srinivas
హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకుందని, కాస్తా ఆలస్యం జరిగినా తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతున్న సమయంలో తెలంగాణవాదులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్దిష్ట కాల పరిమితితో కూడిన షెడ్యూల్ ను ఖరారు చేస్తుందని ఆయన చెప్పారు. విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. వేణుగోపాల్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య బాధాకరం, దురదృష్టకరమని ఆయన అన్నారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచి జులై 25వ తేదీ వరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) నిర్ణయించింది. శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ లో పోలింగ్ బూత్ స్థాయి ఎన్నికలు, మే 15 నుంచి 31 వరకు బ్లాక్ కాంగ్రెసు కమిటీ ఎన్నికలు, జూన్ 7 నుంచి 27 వరకు జిల్లా, నగర కాంగ్రెసు కమిటీ ఎన్నికలు నిర్వహిస్తారు. జులై 5 నుంచి 25 వరకు పిసిసి కార్యవర్గం, ఎఐసిసి సభ్యుల ఎన్నిక, ప్లీనరీ సమావేశంలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+