వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు 24 గంటల విద్యాసంస్థల బంద్

By Pratap
|
Google Oneindia TeluguNews

JAC
హైదరాబాద్: తెలంగాణ కోసం విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ విద్యార్థుల జెఎసి రేపు 24 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. మంగళవారం కూడా విద్యాసంస్థల బంద్ పాటించాలని విద్యార్థుల జెఎసి పిలుపునిచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం ప్రారంభమైన పరీక్షలను బహిష్కరించారు. ఒక సెమిస్టర్ నష్టపోయినంత మాత్రాన పెద్దగా ప్రభావమేమీ ఉండదని, బతుకులు బాగు చేసుకునేందుకు జరుగుతున్న పోరాటంలో అది పెద్ద విషయం కాదని తెలంగాణ విద్యార్థుల జెఎసి నాయకులంటున్నారు.

ఓ వైపు పరీక్షల వివాదం, మరో వైపు వేణుగోపాల్ రెడ్డి హత్య సంఘటనలతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేణుగోపాల్ రెడ్డి మృతి నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. విద్యార్థి ఆత్మహత్యను హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు మంగళవారం పరీక్షలు బహిష్కరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X