వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులు వెళ్ళిపోవాలి: కెసిఆర్ డిమాండ్

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఓయూలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌ను టీఆర్‌ ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ క్యాంపస్‌ నుంచి తక్షణమే పోలీసులను ఉపసంహరించాలన్నారు. విద్యార్థుల శాంతియుత ఉద్యమాన్ని హింసాత్మకంగా చూపేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని కేసీఆర్‌ ఆరోపించారు.

ఉస్మానియా వర్శిటీ నుంచి పోలీసులను తక్షణమే ఉపసంహరించాలని తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్ చేశారు. ఓయూ నుంచి వేణుగోపాల్‌రెడ్డి అంతిమయాత్రను పోలీసులు అడ్డుకున్నందుకు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని విద్యార్ధులు చెబుతుంటే ఎందుకు అనుమతి ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. పోలీసుల ఆధీనంలో ఉన్న వేణుగోపాల్‌రెడ్డి మృత దేహాన్ని అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X