వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హింస ద్వారా తెలంగాణ సాధించుకోలేరు: ఏఐసిసి

|
Google Oneindia TeluguNews

Abhishek Singhvi
న్యూఢిల్లీ: హింసాత్మక చర్యల ద్వారా తెలంగాణ రాష్ట్రం రావడం దుర్లభం అన్నది తెలుసుకోవాలని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్నదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో హింసకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత విద్యార్థులు, పార్టీల నాయకులదే అని ఆయన సూచించారు. ముందుగా రాష్ట్రంలో శాంతి నెలకొనాలని ఆయన సూచించారు. ఒక్క రాత్రిలోనో లేదా ఒక్క రోజులోనో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదన్న విషయాన్ని తెలుసుకోవాలని సింఘ్వి హితవు పలికారు. బుధవారంనాడు హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థుల దాడులు, పోలీసుల లాఠీచార్జీ సంఘటనలను ఆయన ఖండించారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు అన్ని ప్రాంతాల వారూ సంయమనం పాటించాలని, సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.

హింసతో ఏదీ సాధించలేమన్న నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఎఐసిసి అధికార ప్రతినిధి సింఘ్వీ హితవు పలికారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యంత సమర్ధవంతమైనదని అలాంటి రాష్ట్రాన్ని ఆందోళనలు, హింసాత్మక చర్యలతో నిర్వీర్యం చేయవద్దని ఆయన కోరారు. విద్యార్థులు, పార్టీలు నిబద్ధతతో ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన సూచించారు. తెలంగాణ అంశంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తెలంగాణపై కేంద్రానికి నిబద్ధత లేదంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. వ్యక్తిగత ఇష్టాలకు కాంగ్రెస్ పార్టీలో తావులేదన్నారు. తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని, ఏకాభిప్రాయ సాధనకు కేంద్రం కృషి చేస్తున్నదని సింఘ్వి స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X