అంతర్వేది ఉత్సవాలు-నేటి నుంచి 31 వరకు

Lakshmi Narasimha Swamy
సఖినేటిపల్లి: సాగర సంగమ స్ధలంలో వెలిసిన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రథసప్తమిని పురస్కరించుకుని స్వామివారికి సప్త నదీ జలాభిషేకం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈనెల 31 వరకు కన్నుల పండుగగా ఉత్సవాల నిర్వహణకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. 25న కల్యాణం, 26న రథోత్సవం, 30న పౌర్ణమి స్నానం జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా ఏర్పాట్లు చేసినట్టు ఏసీ కె.నరసింహరాజు తెలిపారు. కల్యాణం, రథోత్స వం, పౌర్ణమి పర్వదినాల్లో భక్తుల వెల్లువను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సౌకర్యాలు రెట్టింపు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

కల్యాణ మహోత్సవాల్లో స్వామివారికి వివిధ వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ప్రధానార్చకుడు వాడపల్లి బుచ్చిబాబు తెలిపారు. ఇప్పటికే ఆల యంలో పదిలంగా ఉంచిన సప్తనదుల జలాలతో శుక్రవారం స్వామి వారికి నిర్వహించే అభిషేకం ఎంతో పవిత్రమైనదన్నారు. చరిత్రలోనే మొదటిసారిగా ఆలయంలో జరుగుతున్న ఈ అభిషేకానికి విశేష ప్రాధాన్యం ఉందని,విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మాఘమాసం లో సూర్యుడి పుట్టిన రోజైన రథసప్త మి, లక్ష్మీప్రదమైన శుక్ర వారం నిర్వహిస్తున్న ఈ అభిషేకంతో స్వామివారికి మరింత దివ్యతేజస్సు చేకూరుతుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+