తెలంగాణపై కోర్ కమిటీ సమావేశం

తెలంగాణ పార్లమెంటు సభ్యులు శుక్రవారం డి.శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. తెలంగాణపై ఒక కమిటీని వేసే అవకాశం ఉందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ చెప్పారు. ఈ కమిటీకి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా అంగీకరిస్తారని ఆయన అన్నారు. రాజ్యాంగ సంక్షోభం వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు. ఆయన పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీతో తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మరోసారి ఈ నెల 26వ తేదీన ఢిల్లీ వస్తున్నారు. తెలంగాణపై కేంద్రం నుంచి ఈ నెల 28వ తేదీలోగా ఒక ప్రకటన వెలువడుతుందని యాష్కీ చెప్పారు.












Click it and Unblock the Notifications