వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ పర్యటన తిరుపతి యాత్ర కాదు: అమోస్

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: ఢిల్లీకి వెళ్లడమంటే తిరుపతి యాత్ర చేయడం కాదని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకుడు కెఆర్ అమోస్ అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల ఢిల్లీ పర్యటన రద్దు కావడంపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద ఆ విధంగా ప్రతిస్పందించారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా సంకేతాలిస్తోందని, అందువల్ల రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణపై త్వరలోనే ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు.

తమ ప్రతినిధులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, కేశవరావు రాత్రి రెండు గంటల వరకు అధిష్టానానికి చెందిన నాయకులతో మాట్లాడారని, తమ ప్రతినిధులు తెచ్చే సందేశం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు. వారు తెచ్చే సందేశం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే రాజీనామాలు చేసే విషయంలో వెనకడుగు వేయబోమని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడానికి జెఎసి పెట్టిన గడువుకు ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X