చర్చలకు బృందాలుగా ఢిల్లీ రావద్దు: మొయిలీ

సంక్షోభం వల్ల తెలంగాణ రాదని ఆయన చెప్పారు. పార్లమెంటులో బిల్లు పెట్టాలంటే రాష్ట్రంలో శాసనసభ కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రజాప్రతినిధులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ తగిన విధంగా సహకరించాలని ఆయన సూచించారు. తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల గురించి కూడా తమకు తెలుసునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications