మేడారం జాతరలో సిఎం రోశయ్య

Rosaiah
వరంగల్: ముఖ్యమంత్రి కె. రోశయ్య మంగళవారం వరంగల్ జిల్లాలోని మేడారంలో సమ్మక్క - సారలక్క జాతరను ప్రారంభించారు. ఆయన హైదరాబాదు నుంచి హెలికాప్టర్ లో ఇక్కడికి చేరుకున్నారు. సమ్మక్క, సారలక్కలకు తన నిలువెత్తు బంగారం (బెల్లం) ఇచ్చారు. రోశయ్య 89 కిలోలు తూగారు. ఆయన 45 నిమిషాల పాటు మేడారంలో గడిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతానని ఆయన చెప్పారు. మేడారానికి ప్రత్యేకంగా తానేమీ హామీలు ఇవ్వలేదని ఆయన చెప్పారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆయన చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తాను ఒక్క రోజు ముందుగా వచ్చినట్లు ఆయన తెలిపారు. మేడారం జాతర రేపు ప్రారంభమవుతోంది.

అంతకు ముందు ఆయన సమ్మక్క సారలమ్మలకు ప్రభుత్వం తరఫున చీరలు అందించారు. అక్కడ స్నాన ఘట్టాలకు శంకు స్థాపన చేశారు. కన్నెపల్లి, వూరట్టం, పడిగావుల గ్రామాలకు రక్షిత నీరు అందించే పథకానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. మేడారం జాతరకు 90 లక్షల మంది వస్తారని ఒక అంచనా. తెలంగాణ ఉద్యమం ఊపుగా నడుస్తున్న నేపథ్యంలో రోశయ్య పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రోశయ్య కార్యక్రమం సందర్భంగా నిరసన తెలియజేయడానికి బయలుదేరిన తెలంగాణ ఆందోళనకారులను పోలీసులు ములుగు వద్ద అరెస్టు చేశారు. మేడారం జాతరలో ముఖ్యమంత్రి వెంట దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+