కారకులపై క్రిమినల్ చర్యలు: కలెక్టర్
శిథిలాల కింది నుంచి ఆరుగురిని ప్రాణాలతో వెలికి తీశామని, వారికి చికిత్స జరుగుతోందని ఆయన చెప్పారు. ఇంకా కొంత మంది శిథిలాల కింద ఉండవచ్చుననే అనుమానంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగిస్తున్నామని ఆయన అన్నారు. తొలగింపులు పూర్తయిన తర్వాత భవనం కూలిన సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని ఆయన అన్నారు.
భవనం కూలిన సంఘటనపై బిజెపి స్థానిక శాసనసభ్యుడు జి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అధికారుల నిర్లక్ష్యమే సంఘటనకు కారణమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదని ఆయన విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.