వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: హైదరాబాదులోని నారాయణగూడ భవనం కూలిన ప్రమాదంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. నారాయణ గూడ ప్రమాదంలో అధికారులు వేగంగా స్పందించి ఉంటే మరికొంత మంది ప్రాణాలైనా రక్షించి ఉండేవారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శిథిలాలను తొలగించే పరికరాలు అందుబాటులో ఉన్నా వాటిని వినియోగించడంలో అధికారులు విఫలం చెందారని చంద్రబాబు అన్నారు. సహాయ చర్యలకు నాయకత్వం వహించడం, చొరవతో సహాయచర్యల్లో అధికారులు పాల్గొనలేకపోయారని చంద్రబాబు అన్నారు. పాలనలో అలసత్వం, నిర్లక్ష్యం రాజ్యమేలుతోందని ఆయన అన్నారు.

పునాది సరిగా లేకుండా నాలుగు అంతస్తులు కట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇలాంటి నిర్మాణాలు నగరంలో కోకొల్లలుగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. అసలు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఎవరనేది గుర్తించడంలో కూడా గంటల కొద్దీ ఆలస్యం జరగడం పాలనా యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. బాధితుల సమాచారం కూడా అధికారులు సేకరించలేకపోయారని ఆయన అన్నారు. సహాయక చర్యలు చేపట్టే సమర్థత కూడా అధికార యంత్రాంగానికి లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X