తెలంగాణలో గతంలో పర్యటించా: రవిందర్ కౌర్

సామాజిక శాస్త్రవేత్తగా వాస్తవంగా ప్రజలు ఏమనుకుంటున్నారో అధ్యయన చేస్తానని ఆమె చెప్పారు. వాస్తవాలను నిష్పక్షపాతంగా మదింపు చేయడమే తమ పని అని ఆమె చెప్పారు. విధివిధానాలు ఖరారైన తర్వాత కమిటీలోని ఎవరు ఏ పని చేయాలో నిర్ణయమవుతుందని ఆమె అన్నారు. ఒకటి రెండు రోజుల్లో విధివిధానాలు ఖరారవుతాయని ఆమె అన్నారు. కమిటీ నుంచి వచ్చే నిర్ణయం మరో వివాదానికి దారి తీయకుండా చూస్తామని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో సాగుతోందని, అయితే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనూ వెనకబడిన ప్రాంతాలు ఉండవచ్చునని ఆమె అన్నారు. విధివిధానాలు వెల్లడైన తర్వాత తాము ఏ మార్గంలో వెళ్లాలో అర్థమవుతుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications