మొయిలీ తెలంగాణకు వ్యతిరేకమా?

అదే విధంగా సమన్వయ కమిటీలో వైయస్ జగన్, కెవిపిని వేయడం తెలంగాణకు సంబంధించి పార్లమెంటు సభ్యులను వేయకపోడం కూడా వారి అసంతృప్తికి కారణంగా ఉంది. సమైక్యాంధ్రవాదులు సమన్వయ కమిటీలో బలంగా ఉండేలా చూశారని వారంటున్నారు. సమన్వయ కమిటీలో తెలంగాణ నుంచి ఉన్న గీతారెడ్డి పెద్దగా గొంతు విప్పలేరనే వాదన కూడా ఉంది. కానీ ఈ విషయాలను వారు మాట్లాడడం లేదు. వీరప్ప మొయిలీ సీమాంధ్ర నాయకులకు, ముఖ్యంగా వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయి. నిజానికి, వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది మొదటి నుంచీ ఆయన వాదనగా తెలుస్తోంది. కానీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆలోచన మరో రకంగా ఉండడం వల్లనే ఆయన ఆలోచనలు ఆచరణకు రాలేదని అంటున్నారు. ఈ రకంగా కూడా మొయిలీ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశాలున్నట్లు వారు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications