వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసు డుమ్మా: తెలంగాణ జెఎసి భేటీ వాయిదా
రాజీనామాల నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెసు తెలంగాణ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వారు శనివారం జెఎసి సమావేశం వాయిదా పడే ఎత్తుగడను ఎంచుకున్నారు. పార్టీ అధిష్టానం రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించడంతో వారు జెఎసిలో ఉంటూనే రాజీనామాల వ్యవహారాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జెఎసి నుంచి తప్పుకుంటే ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో జెఎసిలో కొనసాగుతూ తమ పద్ధతిలో తాము పనిచేసుకుంటూ వెళ్లే కొత్త పంథాను వారు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. కాగా, శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు రెండు మూడు రోజుల్లో ఖరారవుతున్నాయని, అప్పటి దాకా వేచి చూద్దామని, కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఎంత వరకైనా వెళ్దామని కాంగ్రెసు తెలంగాణ నాయకులు వాదిస్తున్నారు.
Comments
Story first published: Saturday, February 6, 2010, 10:18 [IST]