వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు డుమ్మా: తెలంగాణ జెఎసి భేటీ వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

JAC
హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధుల జెఎసి సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం శనివారం జరగాల్సి ఉంది. కాంగ్రెసు నాయకులు ఈ సమావేశానికి రాలేమని చెప్పడంతో ఈ సమావేశం వాయిదా పడింది. తమకు వేరే సమావేశం ఉందని, అందువల్ల తాము రాలేకపోతున్నామని, సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెసు పార్టీ నాయకులు చెప్పారు. దీంతో సమావేశం వాయిదా పడక తప్పలేదు. అయితే తప్పించుకోవడానికే కాంగ్రెసు నాయకులు అలా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. సమావేశాన్ని వాయిదా వేసినా తర్వాత జరిగే సమావేశానికి కాంగ్రెసు నాయకులు వస్తారనే నమ్మకం లేదని వారంటున్నారు. కాగా, ఇదే సమయానికి కాంగ్రెసు తెలంగాణ నాయకులు సమావేశమవుతున్నారు. కాంగ్రెసు గైర్హాజరీ నిర్ణయం జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఇరకాటంలో పడ్డారు.

రాజీనామాల నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెసు తెలంగాణ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వారు శనివారం జెఎసి సమావేశం వాయిదా పడే ఎత్తుగడను ఎంచుకున్నారు. పార్టీ అధిష్టానం రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించడంతో వారు జెఎసిలో ఉంటూనే రాజీనామాల వ్యవహారాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జెఎసి నుంచి తప్పుకుంటే ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో జెఎసిలో కొనసాగుతూ తమ పద్ధతిలో తాము పనిచేసుకుంటూ వెళ్లే కొత్త పంథాను వారు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. కాగా, శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు రెండు మూడు రోజుల్లో ఖరారవుతున్నాయని, అప్పటి దాకా వేచి చూద్దామని, కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఎంత వరకైనా వెళ్దామని కాంగ్రెసు తెలంగాణ నాయకులు వాదిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X